కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ జూన్ 3న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్సింగిల్ ‘మత్తు మత్తుగా’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ గీతానికి చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. ‘మత్తుగా మత్తుగా మగువ మత్తుగా..మందు మత్తుగా లేనే లేదేంట్రా..కొత్త బీట్ను కొట్టండ్రా’ అంటూ పక్కా మాస్ శైలిలో హుషారెత్తించేలా ఈ పాట సాగింది. కమల్హాసన్ చేసిన నృత్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటను ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం. గ్యాంగ్వార్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జుణ్దాస్, శివాని నారాయణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణ సంస్థ: రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, దర్శకత్వం: లోకేష్ కనకరాజ్.