దర్శకుడు శంకర్ ‘ఇండియన్-2’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. శంకర్ కెరీర్లో ఒకేసారి రెండు సినిమాలను డైరెక్ట్ చేయడం ఇదే ప్రథమం. అయితే, ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదల అవుతుంది? అనే విషయంపై రకరకాల చర్చలు నడిచాయి. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఓ క్లారిటీ వచ్చింది.
‘ఇండియన్-2’ ముందు విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మంగళవారం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్సింగ్, సముద్రఖని ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు సుభాస్కరన్, ఉదయనిధి స్టాలెన్.