కల్యాణ్రామ్ మంచి హీరోనే కాదు, అభిరుచి గల నిర్మాత కూడా. తను ఎంచుకునే కథలే అందుకు నిదర్శనాలు. సురేందర్రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ట.. ఈ ముగ్గుర్నీ దర్శకుల్ని చేసింది కల్యాణ్రామే. ప్రస్తుతం ఆయన అభిషేక్ నామా దర్శకత్వంలో ‘డెవిల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత పవన్ సాదినేని దర్శకత్వంలో కల్యాణ్రామ్ నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి ఇది ఏనాడో అనుకున్న కలయిక.
హరికృష్ణ జీవించివున్న రోజుల్లో కల్యాణ్రామ్, హరికృష్ణ కాంబినేషన్లో పవన్ సాదినేని ఓ మల్టీస్టారర్ కథను రాసుకున్నాడు. ఆ కథను కల్యాణ్రామ్ ఓకే చేశాడు కూడా. అయితే, హరికృష్ణ హఠాన్మరణంతో ఆ ప్రాజెక్ట్కు బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది. అలాగే వశిష్ఠ దర్శకత్వంలోనే ‘బింబిసార2’ కూడా కల్యాణ్రామ్ చేయనున్నారు.