‘ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్గా ఉండే కథ ‘మిత్రమండలి’. ఈ కథతో చాలా ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు బన్నీవాస్. ఆయన ద్వారానే ఈ కథ మా వద్దకు వచ్చింది. వినగానే నచ్చేసింది.’ అని నిర్మాతలు కల్యాణ్ మంథిన, భాను ప్రతాప అన్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం జంటగా విజయేందర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిత్రమండలి’. డా.విజేందర్రెడ్డి తీగలతో కలిసి కల్యాణ్ మంథిన, భాను ప్రతాప ఈ చిత్రాన్ని నిర్మించారు.
బన్నీవాస్ సమర్పకుడు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో కల్యాణ్ మంథిన, భానుప్రతాప విలేకరులతో మాట్లాడారు. ‘దర్శకులు అనుదీప్, ‘మ్యాడ్’ కల్యాణ్, ఆదిత్యహాసన్లతో కలిసి పనిచేసిన అనుభవం డైరెక్టర్ విజయేందర్కి ఉంది. తను మంచి దర్శకుడు.
పూర్తి స్క్రిప్ట్తో మా వద్దకు వచ్చాడు. ఈ కథ రాసుకున్నప్పుడే కాస్టింగ్ విషయంలో తనకు ఓ ప్లానింగ్ ఉంది. అందుకే పాత్రలన్నీ పర్ఫెక్ట్గా సెట్టయ్యాయి. మొత్తంగా కథ ఎంత అద్భుతంగా రాసుకున్నాడో, అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు విజయేందర్.’ అని నిర్మాతలు కల్యాణ్, భానుప్రతాప తెలిపారు. బ్రహ్మానందం స్పెషల్ అట్రాక్షన్గా తీసిన ‘జంబర్ గింబర్ లాలా..’ సాంగ్ ఈ సినిమాకే హైలైట్ అని, ఆ పాట చిత్రీకరణ విషయంలో బ్రహ్మానందం బాగా సహకరించారని నిర్మాతలు చెప్పారు.
‘మిత్రమండలి’ ఓ బడ్డీస్ కామెడీ. ‘జంగ్లీ పట్టణం’ అనే ఫిక్షనల్ టౌన్లో జరిగే కథ ఇది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు యూత్కి రిలేటెడ్గా ఉంటాయి. ప్రియదర్శి కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. ఇక నిహారక తన శైలి సెటైర్లతో అలరిస్తుంది. లేని ఓ కులం పేరుని ఈ సినిమాకోసం తీసుకొచ్చాం. సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టం మీద సెటైరికల్గా ఈ సీన్లు ఉంటాయి. దీపావళికి సరైన సినిమా ఇది.’ అని తెలిపారు