తన అందం, అభినయంతో వరల్డ్ వైడ్గా కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది బాలీవుడ్ (Bollywood)నటి కాజోల్ (Kajol). వయస్సు మీద పడుతున్న ఛాయలు ఏమీ కనిపించకుండా కుర్ర హీరోయిన్లకు ధీటుగా పోటీ పడి మరి సిల్వర్ స్క్రీన్పై మెరుస్తుంది కాజోల్. ఈ భామకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇపుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఇంతకీ అంత హాట్ టాపిక్ ఏంటనుకుంటున్నారా..? కాజోల్ ముంబైలో రెండు అపార్టుమెంట్లను కొనుగోలు చేసిందట.
జుహూలోని అనన్య బిల్దింగ్ ( Juhu Ananya building)లో రెండు అపార్టుమెంట్ల కోసం కాజోల్ ఏకంగా రూ.11.95 కోట్లను ఖర్చు పెట్టిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ రెండు అపార్టుమెంట్లు బిల్డింగ్లోని 10వ అంతస్థులో ఉన్నాయి. కంబైన్డ్ కార్పెట్ ఏరియా 2వేల చదరపు అడుగులు ఉంటుందట. నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు త్రిబంగతో గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది కాజోల్.
ఈ బ్యూటీ నటిస్తోన్న కొత్త చిత్రం సలామ్ వెంకీ గత వారం మొదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నటి, దర్శకురాలు రేవతి డైరెక్ట్ చేస్తోంది.