పెళ్లి తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలకు ప్రాధాన్యమిస్తోంది కాజల్. మహిళా ప్రధాన ఇతివృత్తాలు, చాలెంజింగ్ రోల్స్పై దృష్టి సారిస్తున్న ఆమె తాజాగా బాలీవుడ్లో ‘ఉమ’ అనే ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఫీల్గుడ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తథాగథ సింఘా దర్శకత్వం వహిస్తున్నారు. రాజవంశానికి చెందిన కుటుంబంలో జరిగే వివాహ వేడుక నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకలోకి అపరిచితురాలైన ఉమ అనే యువతి రంగప్రవేశంతో ఏం జరిగిందనే కథాంశంతో ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. నటనాపరంగా చాలెంజింగ్గా నిలుస్తూనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథలకు తాను ప్రాముఖ్యతనిస్తానని, ‘ఉమ’ ఆ కోవకు చెందిన సినిమాయేనని కాజల్ అగర్వాల్ తెలిపింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెడతామని.. సెట్స్లో అడుగుపెట్టడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కాజల్ వెల్లడించింది. అవిషేక్ ఘోష్, మంత్రారాజ్ పలివాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆచార్య’తో పాటు నాగార్జునతో మరో సినిమా చేస్తోంది కాజల్.