కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ రొటీన్కు భిన్నంగా సినిమాలు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. అ! అనే సినిమాలో కాస్త వైవిధ్యమైన పాత్రను పోషించింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమాలు చేస్తున్న కాజల్ మహిళా ప్రాధాన్యత చిత్రం చేయడానికి సిద్దమైందట. ఈ చిత్రాన్ని పేపర్ బాయ్ చిత్రాన్ని తెరకెక్కించిన జై శంకర్ డైరెక్ట్ చేయనున్నాడట.
థ్రిల్లర్ కాన్సెప్ట్తో చిత్రం రూపొందనుండగా, ఈ సినిమా కాజల్కు ఎంతగానో నచ్చడంతో దర్శకుడు ఫుల్ ఖుష్ అయ్యాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనున్నట్టు తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ వలన విధించిన లాక్డౌన్ పూర్తయ్యాక మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.