K Viswanath | ప్రముఖ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ (K Viswanath) మృతి పట్ల యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కే విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాప సందేశాన్ని తెలియజేస్తున్నారు. కే విశ్వనాథ్ను కలిసిన సమయంలో దిగిన ఫొటోను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ట్విట్టర్లో షేర్ చేస్తూ సంతాపం తెలియజేశాడు.
‘భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన కే విశ్వనాథ్ ఇక లేరు. నేను ఎప్పటికీ ఎంతగానో అభిమానించే గొప్ప దర్శకుల్లో కే విశ్వనాథ్ ఒకరు. ఆయన ప్రతీ నటుడికి గురువు లాంటి వారు. కళాతపస్వి మనల్ని వదిలివెళ్లినా ఆయన అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలతో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. గురూజీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా..’ అని సంతాప సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ సంతాప సందేశం..
Master of the Craft . One of my most most fav directors of all time . Teacher for every actor . Pride of Indian cinema Vishawanath garu no more . He left us but his Masterpieces will live on forever . Rest in Peace guruji 🙏🏽 pic.twitter.com/YUIhHwmhge
— Allu Arjun (@alluarjun) February 3, 2023