ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నారు. జూన్ ద్వితీయార్థంలో షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ముప్పయ్యవ సినిమా ఇది కావడంతో ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాణిజ్య విలువలకు సామాజికాంశాల్ని జోడించి సినిమాలు తీయడం దర్శకుడు కొరటాల శివ శైలి. ఎన్టీఆర్ సినిమాలో సైతం ఆయన సోషల్ఇష్యూస్ను చర్చించబోతున్నట్లు తెలిసింది. ఓ సామాన్యుడు వ్యవస్థను సంస్కరించే క్రమంలో అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్నదే ఈ చిత్ర కథాంశమని చెబుతున్నారు. కథలో రాజకీయ, సామాజిక అంశాల చర్చ ఉంటుందని, ఎన్టీఆర్ ఇమేజ్కు తగినట్లుగా చక్కటి సందేశం కలబోతగా సినిమా సాగుతుందని అంటున్నారు.