‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నారు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సాధించి భారతీయ సినిమా కీర్తిని ప్రపంచానికి చాటింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యుడిగా జూనియర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించుకున్నారు.
ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమీ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. భారత సినీ పరిశ్రమ నుంచి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకోడం విశేషం. తెలుగు సినిమాకు లభించిన అరుదైన గౌరమిదని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.