కర్ణాటక ప్రభుత్వం దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్కు నేడు కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna ceremony)ను ప్రదానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చేరుకున్నాడు.
కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava celebrations) కార్యక్రమంలో పాల్గొనేందుకు తారక్ బెంగళూరు చేరుకున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. బెంగళూరుకు బయలుదేరినపుడు విమానంలో తీసిన ఫొటోతోపాటు సిటీలో ల్యాండ్ అయ్యాక దిగిన ఫొటో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. కన్నడ పవర్ స్టార్గా సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను అలరిస్తూనే.. సమాజ సేవలో కూడా తన వంతు పాత్ర పోషించిన పునీత్ రాజ్కుమార్ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ఆయనకు కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది. తమిళసూపర్ స్టార్ రజినీకాంత్తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పునీత్ రాజ్కుమార్ కుటుంబసభ్యులు ఈ అవార్డు అందుకోనున్నారు.
NTR @tarak9999 off to Bangalore for #KannadaRajyotsava pic.twitter.com/TF6KTAZ85B
— BA Raju's Team (@baraju_SuperHit) November 1, 2022
#NTR has arrived in Bangalore to attend #KarnatakaRajyotsava where #PuneethRajkumar Garu will be awarded “Karnataka Ratna”.@tarak9999 #JrNTR #PuneethRajKumarLivesOn pic.twitter.com/qKev1RBf5B
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 31, 2022