Prashanth Neel | కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఇంట్లో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ దంపతులు సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం బెంగళూరుకు పయనమైన విషయం తెలిసిందే. దేవర షూటింగ్లో భాగంగా వెళుతున్నాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ ఇంట్లో ప్రైవేట్ పార్టీ ఉండగా.. ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి కలిసి వెళ్లారు. ఇక వీరితో పాటు కాంతార నటుడు రిషబ్ షెట్టి ఫ్యామిలీ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ కూడా ఈ పార్టీలో పాల్గోన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రిషబ్ షెట్టి కాంతార ప్రీక్వెల్లో నటిస్తుండగా… ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.