మ్యూజిక్ దిగ్గజం మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఆయన ప్రతి సినిమాలో భాగం అయ్యేవారు. సూపర్ హీరోస్ సినిమాతో పరిచయమైన ఈయన.. పదేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. కుర్ర సంగీత దర్శకుల జోరుతో మధ్యలో ఈయన జోరుకి కాస్త బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ కుమ్మేస్తున్నారు. రీసెంట్ కాలంలో మణిశర్మ 10 సినిమాలకు పైగానే సంగీతం అందించారు.
చిరంజీవి ఆచార్య, విజయ్ దేవరకొండ లైగర్,సమంత అక్కినేని ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ డ్రామా శాకుంతలం, సుధీర్ బాబు హీరోగా వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ , వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప, గోపిచంద్ సీటీమార్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.ఇక దేవా కట్టాతో సాయి తేజ్ చేస్తున్న రిపబ్లిక్కి కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
రిపబ్లిక్ కోసం మణిశర్మ మంచి మాస్ బీట్స్ సిద్దం చేయగా, ఆ సాంగ్ని సెప్టెంబర్ 6 ఉదయం 11గం.లకు రిలీజ్ చేయనున్నారట. ఇందుకోసం ఓ ప్రమోషనల్ వీడియో రూపొందించారు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. చిత్రంలో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్గా నటిస్తున్నాడు సాయి ధరమ్. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు.