అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో అందాలు ఆరబోస్తూ యువత మనసులు దోచుకుంటుంది. రూహి సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ అమ్మడు గ్లామర్ షో హాట్ టాపిక్గా మారింది. తాజాగా మాల్దీవుల కోసం వెకేషన్లో భాగంగా వెళ్లిన జాన్వీ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ హాట్ హాట్గా ఫొటో షూట్స్ చేసింది.
జాన్వీని బికినీలో చూసిన ఫ్యాన్స్కు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. శ్రీదేవి ఎంత పద్దతిగా కనిపిస్తే జాన్వీ కంప్లీట్గా రూట్ మార్చి యువతను రెచ్చగొడుతుందేమిటీ అని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం జాన్వీ హాట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’లో జాన్వీ నటిస్తోంది. ‘గుడ్ లక్ జెర్రీ’, కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘తఖ్త్’, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.