సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ సోషల్ మీడియా ద్వారా సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తన గళం వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ సామెతతో మీడియాపై మండి పడింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి.
ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా, ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా… ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
వాళ్లు ఏం చూపించాలని అనుకుంటున్నారో అదే చూపిస్తున్నారు. మనమందరం వాచ్ డాగ్స్, స్కేప్ గోట్స్… హిప్నోటిక్ కెమెరా లెన్స్ చూసినపుడు ప్రజలు తమ కంట్రోల్ కోల్పోతారు. ఈ నాన్సెన్స్ కు దూరంగా ఉండండి. వార్తలను జాగ్రత్తగా ఎంచుకోండి అంటూ ఝాన్సీ గట్టిగానే స్పందించింది. కాగా, సమంత విడాకుల వ్యవహారం నుండి మా ఎలక్షన్స్ వరకు మీడియా చూపిన అతి చొరవ వల్లనే తాను ఇలా కామెంట్ చేసిందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.