బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వరుస పెట్టి తెలుగు సినిమా రీమేక్లు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన షాహిద్ ఇప్పుడు తెలుగులో సూపర్హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే టైటిల్తో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మాతృక దర్శకత్వం వహించిన గౌతమ్ తన్ననూరీనే దర్శకత్వం వహిస్తున్నాడు. థియేటర్లో సినిమాను విడుదల చేద్దాం అనుకున్న సమయంలో కరోనా ఉదృతి పెరగడం, థియేటర్స్ మూతపడడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.
ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు . అందుకే ‘జెర్సీ’ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచి రేటు వస్తే.. ఈ సినిమాను ఓటీటీలో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇక ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ – దిల్ రాజు – సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.