హైదరాబాద్ : ‘మా’ ( MAA ) ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి జీవిత, హేమ తప్పుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా జీవిత, ఉపాధ్యక్షురాలిగా హేమ పోటీ చేస్తున్నారు. దీంతో త్వరలో జరగబోయే ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ ఉండనుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘మా’ ఎన్నికల ప్యానెల్ను ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. అనసూయ, అజయ్, ఖయ్యూం, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి. సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీష్, టార్జాన్, ట్రెజరర్గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయనున్నారు. జయసుధ అమెరికా వెళ్లిపోవడం వల్ల తమ ప్యానెల్లో లేరు. ప్యానెల్కు అండగా ఉంటానని జయసుధ తెలిపినట్లు ప్రకాశ్ రాజ్ చెప్పారు.