చిన్నసినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుకుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరోతో ప్రమోషన్ చేయించుకున్న జాతి రత్నాలు టీం థియేటర్స్ లో నవ్వులు పంచింది.
‘జాతి రత్నాలు’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు షేర్తో పాటు రూ. 64.20 కోట్లు గ్రాస్ను వసూలు చేసింది. తద్వారా రూ. 27.02 కోట్లు లాభాలను అందుకుంది. పూర్తి స్థాయిలో ఫన్ రైడ్తో థియేటర్లలో నవ్వులు పంచిన ఈ చిత్రం సామాన్యులనే కాదు సెలబ్రిటీలను సైతం మెప్పించింది. తాజాగా ఈ చిత్రాన్ని బుల్లితెరపై ప్రసారం చేశారు. ఈ చిత్రానికి 10.21 టీఆర్పీ రేటింగ్ దక్కింది.
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు బుల్లితెరపై ఇంతటి రెస్పాన్స్ వస్తుంటుంది.అలాంటిది యంగ్ హీరో సినిమాలకు అంత భారీ రేటింగ్ రావడంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. ‘జాతి రత్నాలు’ ఈ ఏడాది విడుదలైన టాప్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. ఇంత సక్సెస్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘జాతి రత్నాలు’ మూవీలో నవీన్ పోలిశెట్టి – ఫరియా అబ్దుల్లా జంటగా నటించగా.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్పై ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులోని చిట్టి అనే సాంగ్ ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.