తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. అతని తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. ‘విజయ్ తనయుడిని మా సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది.
అతను చెప్పిన కథ ఎక్సైయిటింగ్గా అనిపించింది. గొప్ప దర్శకుడిగా ఎదిగి తండ్రి పేరు నిలబెట్టాలని ఆకాంక్షిస్తున్నాం’ అని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. జాసన్ సంజయ్ టొరంటో ఫిల్మ్ స్కూల్లో డిప్లొమా, లండన్ యూనివర్సిటీలో స్క్రీన్రైటింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ఔత్సాహిక నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని, పేరొందిన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్లో భాగమవుతారని జాసన్ సంజయ్ తెలిపారు.