న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఇటీవల ముంబైలోని కలినా ఎయిర్పోర్టులో కనిపించింది. బాయ్ఫ్రెండ్ శిఖర్ పహరియా(Shikar Pahariya)తో కలిసి ఆమె ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చారు. మార్చి 31వ తేదీన నీతా అంబానీ ఈవెంట్కు హాజరైన జాన్వీతో పాటు ఆమె భాయ్ఫ్రెండ్ కూడా వచ్చాడు. వైట్ డ్రెస్సులో జాన్వీ దర్శనమిచ్చింది. ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే.. ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. ఆ వీడియోను ఆన్లైన్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
నీతా అంబానీ(Nita Ambani) కల్చరల్ సెంటర్ రెడ్కార్పెట్లో జాన్వీ తండ్రి బోనీ కపూర్తో శిఖర్ ఫోటోలు దిగారు. ఇటీల జాన్వీ, శిఖర్లు పబ్లిక్గా పలుమార్లు కనిపించారు. కానీ ఇప్పటి వరకు తమ పరిచయంపై జాన్వీ మాత్రం ఎటువంటి కామెంట్ చేయలేదు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనువడే శిఖర్ పహరియా. జాన్వీ, శిఖర్ల మధ్య చాన్నాళ్ల నుంచి పరిచయం ఉంది. వాళ్లు ఎప్పటి నుంచి డేటింగ్లో ఉన్నారు.