న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన రాబోయే మూవీ మిలి ప్రమోషన్స్లో భాగంగా థియేటర్లో సందడి చేసింది. ఢిల్లీలోని ఓ థియేటర్లో ఫ్యాన్స్కు ఆమె స్వయంగా పాప్కార్న్ సర్వ్ చేశారు. కౌంటర్ వెనుక నుంచి జాన్వీ కపూర్ పాప్కార్న్లు సర్వ్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎంబ్రాయిడరీతో కూడిన గ్రీన్ శారీలో జాన్వీ కపూర్ మెరిసిపోయింది. గ్లోవ్స్ ధరించి పాప్కార్న్లు సర్వ్ చేస్తూ సందడి చేసింది.
ఆపై పాప్కార్న్ను బకెట్లో నింపి ఓ అభిమానికి ఆమె స్వయంగా అందచేయడం కనిపించింది. జాన్వీ కపూర్ నటించిన మిలి మూవీ త్వరలో బిగ్ స్క్రీన్లపై విడుదల కానుంది. మళయాళం మూవీ హెలెన్ రీమేక్గా మలి తెరకెక్కింది. మనోజ్ పహ్వ, సన్నీ కౌశల్ ఇతర ప్రధాన తారాగణంగా ఈ మూవీ రూపొందింది.