Sridevi | అతిలోక సుందరి శ్రీదేవి మరణించి నాలుగేండ్లు అయిపోతున్నా ఇప్పటికీ ఆమెను ఫ్యాన్స్ మరిచిపోలేకపోతున్నారు. దుబాయిలో ఓ పెండ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవి.. అకస్మాత్తుగా బాత్రూం టబ్లో నిర్జీవంగా పడిపోవడం అందర్నీ కలిచివేసింది. ఆమె కోసం ఎంతోమంది కన్నీళ్లు కార్చారు. అయితే.. ఆమె బతికున్నకాలంలో కుటుంబానికి ఎంతో విలువనిచ్చేది. ముఖ్యంగా కూతుళ్ల కంటే కూడా భర్త బోనీ కపూర్ ( Boney Kapoor )మీద ప్రేమ చూపించేది. అందుకే అతని కోసం ఎంతైనా రిస్క్ చేసేది. ఈ క్రమంలోనే బోనీతో సిగరెట్లు మాన్పించేందుకు శ్రీదేవి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుందట. ఇదే విషయాన్ని శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) తాజాగా వెల్లడించింది.
‘ అప్పట్లో నాన్న ఎక్కువగా సిగరెట్లు కాల్చేవాడు. ఎవరు చెప్పిన ఈ అలవాటు మానేసేవాడు. అందుకే నేను, చెల్లె ఖుషీ కలిసి సిగరెట్లు దాచేసేవాళ్లం. కొన్నిసార్లు సిగరెట్లను ముక్కలు ముక్కలు చేసేసేవాళ్లం. ఒక్కోసారి వాటిల్లో టూత్ పేస్ట్ నింపేవాళ్లం. మేము ఎన్ని రకాలుగా చేసినా నాన్న కొత్త సిగరెట్లు తెచ్చుకుని తాగేవాడు. ఇదే విషయంలో అమ్మ కూడా చాలాసార్లు చెప్పి చూసింది. అయినా కానీ నాన్న వినలేదు. నువ్వు సిగరెట్లు తాగడం మానేయకపోతే నేను నాన్ వెజ్ తినను అని నాన్నతో అమ్మ శపథం పట్టింది. ‘ అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్.
‘ అప్పటికే అమ్మ నీరసంగా ఉండటంతో శక్తి కోసం నాన్ వెజ్ తినాలని డాక్టర్లు సూచించారు. అయినా కూడా నాన్న మారలేదు. సిగరెట్లు తాగడం ఆపలేదు. దీంతో నాన్ వెజ్ తినకపోవడంతో అమ్మ ఆరోగ్యం చెడిపోయి చాలా నీరసంగా తయారైంది. అయినప్పటికీ అమ్మ తన పంతం వీడలేదు. నాన్న తన అలవాటు మానలేదు. చివరికి అమ్మ మరణించిన తర్వాత తన మాట వినలేదని చాలా బాధపడ్డాడు. ఇప్పుడు పూర్తిగా సిగరెట్లు తాగడం మానేశాడు’ అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
“Janhvi Kapoor | చూపులతో కుర్రకారు మనసు దోచేస్తున్న జాన్వీ కపూర్..”