Jabardasth Santhi kumar | ఈటీవిలో టెలికాస్ట్ అయ్యే జబర్ధస్త్ షో తెలుగునాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్లుగా ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్ నటులు మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఇప్పటికే సుధీర్ హీరోగా సక్సెస్ అవగా ఆది, గెటప్ శ్రీను, మహేష్, చమ్మక్ చంద్ర ఇలా పలువురు నటులుగా ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక ఇటీవలే జబర్దస్త్ నటుడు వేణు బలగంతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే బంపర్ హిట్ను సాధించాడు. ఇక వేణు తరహాలోనే మరో బజర్దస్త్ నటుడు దర్శకుడిగా మారాడు.
జబర్దస్త్లో తన కామెడీ టైమింగ్తో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల పంచిన శాంతి కుమార్ ఇప్పుడు మెగాఫోన్ పట్టాడు. సాయికుమార్ను ప్రధాన పాత్రలో పెట్టి ‘నాతో నేను’ అనే ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్తో పాటు పాటలకు సాహిత్యం కూడా అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లో కనువిందు చేయడానికి ముస్తాబవుతుంది.