Rashmi Gautam | సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి గాసిప్ పుట్టుకొస్తుందో చెప్పలేం. ఒక్క వార్త బయటకొస్తే చాలు.. అది నిజమో.. అబద్ధమో తెలిసేలోపే అందరికీ ప్రచారం అయిపోతుంది. ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా కుర్చీ మడతబెట్టి సాంగ్.. అయితే సినిమా విడుదలైనప్పటి నుంచి కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్లో మహేశ్బాబుతో స్టెప్పులేసే ఛాన్స్ ముందుగా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్కు వచ్చిందట. ఇంతటి బంపరాఫర్ వచ్చినప్పటికీ రష్మి నో చెప్పిందని రెండు మూడు రోజులుగా టాలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఆ నోటా.. ఈ నోట రష్మి దగ్గరకు కూడా చేరింది. దీంతో ఈ జబర్దస్త్ యాంకర్ ఘాటుగా స్పందించింది.
కుర్చీ మడతబెట్టి.. సాంగ్లో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోందని.. అదంతా ఫేక్ న్యూస్ అని రష్మి గౌతమ్ సోషల్మీడియా వేదికగా స్పందించింది. అవన్నీ నిరాధారమైన వార్తలని పేర్కొంది. అసలు గుంటూరు కారం టీమ్ తనను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ తనపై నెగెటివిటీని తీసుకొచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేసింది.
This news is absolutely baseless
I was not approached so no scope for rejection
Also poorna garu did an absolute fab job no one else could have done it better
Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024
కుర్చీ మడతబెట్టి సాంగ్లో మహేశ్బాబు – శ్రీలీల వేసిన స్టెప్పులు ఆడియన్స్ను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్లో నటి పూర్ణ కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది. రాజమండ్రి రాగ మంజరి, ఏం రసిక రాజువో మరి.. లైన్స్లో పూర్ణ స్టెప్పులు వేసింది. రెండు లైన్లలోనే కనిపించినప్పటికీ పూర్ణకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే పూర్ణ పోషించిన పాత్ర కోసమే రష్మిని గుంటూరు కారం టీమ్ స్పందించిందని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను ఖండించిన రష్మీ.. ఈ ఎనర్జిటిక్ సాంగ్లో పూర్ణ తప్ప ఇంకెవరూ అంత బాగా చేయలేరని పొగిడింది.