‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావ..’ఐటెంసాంగ్తో కుర్రకారుని హుషారెత్తించింది అగ్ర కథానాయిక సమంత. బన్నీతో కలిసి ఆమె చేసిన నృత్యాలు యువతరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఈ పాట చాలా పాపులర్ అయింది. ఈ గీతానికి లభించిన ఆదరణ దృష్ట్యా సమంతతో ప్రత్యేక గీతం చేయడానికి మరికొందరు అగ్ర దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లైగర్’ చిత్రంలో సమంత స్పెషల్సాంగ్లో నటించనుందని వార్తలొస్తున్నాయి. కథానుగుణంగా ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్కు చోటుందట. ఇందులో అగ్ర కథానాయిక అయితేనే బాగుంటుందే ఉద్ధేశ్యంతో చిత్రబృంద ఉందని తెలిసింది. ‘పుష్ప’లో సమంత పాటకు లభించిన ఆదరణ దృష్ట్యా ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ దిశగా సమంతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే సమంత నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ‘మహానటి’ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన విషయం తెలిసిందే.