సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ (ది రూల్) అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇటీవల హైదరాబాద్లో కీలక షెడ్యూల్ను పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం విశాఖపట్నంలో పది రోజుల పాటు భారీ షెడ్యూల్కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. షిప్యార్డ్లో చిత్రీకరించే ఈ సన్నివేశాలు కథలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే చిత్రబృందం విశాఖపట్నం చేరుకున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్పై ముఖ్య ఘట్టాలను చిత్రీకరిస్తారని, ఫిబ్రవరిలో కథానాయిక రష్మిక మందన్న షూటింగ్లో జాయిన్ అవుతుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.