నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ‘సోషల్ వర్కర్స్’, ‘కోబలి’ అనే రెండు చిత్రాలను ప్రకటించింది. సోషల్ వర్కర్స్ సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. కోబలి చిత్ర నిర్మాణంలో మిత్ర మూవీస్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. మిత్ర ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్ రెడ్డి మాట్లాడుతూ…‘సినీ రంగంలోని సమస్యల నేపథ్యంతో ‘సోషల్ వర్కర్స్’ మూవీ నిర్మిస్తున్నాం. హారర్ థ్రిల్లర్గా ‘కోబలి’ ఉంటుంది. దైవ శక్తి, క్షద్ర శక్తికి మధ్య జరిగే పోరాటం ఈ చిత్రంలో చూస్తారు. ఈ రెండు చిత్రాలతో పాటు హ్యాపీ వుమెన్స్ డే అనే మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాల్లో కొత్త తారాగణం నటిస్తారు’ అని చెప్పారు.