ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ‘మిస్సింగ్’ చిత్రం ఉత్కంఠను పంచుతుందని చెప్పారు చిత్ర దర్శకుడు శ్రీని జోస్యుల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కిరణ్. హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషానారంగ్ నాయకానాయికలుగా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీని మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. అబద్ధంతో మొదలైన కథ అనుకోని మలుపులతో సస్పెన్స్ను సృష్టిస్తుంది. కథ ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. సక్సెస్ఫుల్ స్క్రీన్ప్లే ఫార్ములాతో తెరకెక్కించాం. హీరో హర్ష ఈ పాత్రకు చక్కగా కుదిరాడు. ఇండస్ట్రీ నుంచి సినిమా బాగుందనే ప్రశంసలొస్తున్నాయి. కథలో విషయం ఉంటే తప్పకుండా పరిశ్రమ మద్దతు దొరుకుతుందని ఈ సినిమా నిరూపించింది’ అన్నారు. కిరణ్ మాట్లాడుతూ ‘హీరో హర్ష, నేను మంచి మిత్రులం. నిర్మాతగా తొలి చిత్రం కాబట్టి అనుభవం ద్వారా చాలా నేర్చుకున్నా. ఓటీటీ ఆఫర్లొచ్చినా ఎవరికీ ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా థియేటర్ల్లో ఆస్వాదించాల్సిన సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఆద్యంతం అనూహ్య మలుపులతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు.