హాస్యనటుడు బండ్ల గణేష్ హీరోగా యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్ చంద్ర దర్శకుడు. స్వాతిచంద్ర నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చిత్రబృందం మాట్లాడుతూ ‘తమిళ చిత్రం ‘ఒత్తు సెరుప్పుసైజ్ 7’కు రీమేక్ ఇది. హత్య కేసులో అనుమానితుడిగా పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిన ఓ వ్యక్తికి అక్కడ ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. బండ్ల గణేష్ లుక్, నటన అలరిస్తాయి. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని.