కొందరు దర్శకులు కేవలం ఒకే సినిమాతో స్టార్స్ అయిపోతారు. దాదాపు 32 సంవత్సరాల కింద శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ రాత్రికి రాత్రి ఎలా అయితే స్టార్ డైరెక్టర్ అయిపోయాడో.. సందీప్ రెడ్డి వంగా కూడా అలాగే అయ్యాడు. అర్జున్ రెడ్డి వంటి బ్లాక్బస్టర్ సినిమా తీసిన తర్వాత మళ్లీ రెండో సినిమా చేయలేదు ఈయన. కాకపోతే అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. మహేశ్ బాబు కూడా సందీప్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి సమాచారం లేదు. అయితే, తాజాగా మళ్లీ ఈ ప్రాజెక్ట్పై చర్చ మొదలైంది.
ప్రస్తుతం యానిమల్ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా. క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహేశ్ బాబుతో సందీప్ రెడ్డి వంగా సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ ప్రాజెక్టు ఉందా ఆగిపోయిందా అనే విషయం కూడా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మరోసారి సందీప్ రెడ్డి వంగా సినిమాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ సినిమా ఇంకా ఆగిపోలేదని.. కచ్చితంగా ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయిన మహేశ్ బాబుతో సినిమా చేస్తానని అంటున్నాడు సందీప్. మహేశ్కు సందీప్ రెడ్డి చెప్పిన రెండు మూడు కథలు పెద్దగా నచ్చలేదు. దీంతో మహేశ్ ఇమేజ్కు సరిపోయే కథ కోసం వెతుకుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. దానికోసం ఇంకా సమయం పడుతుంది అంటున్నాడు. అంతేగాని తమ కాంబినేషన్లో సినిమా ఆగిపోలేదు అంటున్నాడు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రజినీకాంత్ చిన్నపిల్లోడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నితిన్ హీరోయిన్
తెలంగాణ 5..ఆంధ్రా 3..మధ్యలో నలిగిపోతున్న నిర్మాతలు..!
త్రివిక్రమ్ సీజనల్ హీరోయిన్స్