సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రజక్త కోలికి మంచి పేరుంది. యూట్యూబ్లో ఆమె చేసిన కామెడీ ప్రోగ్రామ్స్కు కూడా అభిమానులున్నారు. నెట్ఫ్లిక్స్లో ‘మిస్మ్యాచ్డ్’ వెబ్ సిరీస్ సక్సెస్ అయ్యి ప్రజక్త బాలీవుడ్లో అడుగులు వేసేలా చేసింది. ఇటీవల కియారా అద్వానీ, వరుణ్ ధావన్ జంటగా నటించిన ‘జుగ్ జుగ్ జియో’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది ప్రజక్త. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి ఈ ఏడాది సూపర్హిట్స్లో ఒకటిగా నిలిచింది.
దీంతో ప్రజక్త కోలి సినీ పరిశ్రమలోనూ ఫేమ్ అయ్యింది. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమెకు దక్కుతున్నాయి. ఈ అవకాశాలతో సంతోషంగా ఉన్న ఆమె..వికీ కౌశల్తో నటించాలని ఉందనే కోరికను వెల్లడించింది. ‘అతను సహజ నటుడు, అవకాశం వస్తే కలిసి నటించాలని ఉంది’ అని చెప్పింది. త్వరలో ‘మిస్మ్యాచ్డ్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. సంధ్యామీనన్ 2017లో రాసిన ‘వెన్ డింపుల్ మెట్ రిషి’ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.