Indian Street Premier League | కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య క్రీడా రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. లోకల్ టాలెంట్ను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టీ-10 టోర్నీలో చెన్నై జట్టును కొనుగోలు చేశాడు. ఇప్పటికే ముంబై జట్టును నటుడు అమితాబ్ బచ్చన్, బెంగళూరు జట్టును బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, శ్రీనగర్ జట్టును అక్షయ్ కుమార్, హైదరాబాద్ జట్టును తెలుగు నటుడు రామ్ చరణ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ లిస్ట్లో కోలీవుడ్ హీరో సూర్య చేరారు.
ఐఎస్పీఎల్గా పిలువబడే ఈ సిరీస్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కతా, శ్రీనగర్లకు చెందిన ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి ఎడిషన్ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు జరగనుంది. లీగ్లో ప్రతీ మ్యాచ్ 10 ఓవర్ల ఫార్మాట్లో జరుగనుండగా.. ఈ మ్యాచ్లను టెన్నిస్ బాల్తో నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వారు వెబ్సైట్ https://t.co/2igPXtyl29 ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
Vanakkam Chennai! I am beyond electrified to announce the ownership of our Team Chennai in ISPLT10. To all the cricket enthusiasts, let’s create a legacy of sportsmanship, resilience, and cricketing excellence together.
Register now at https://t.co/2igPXtyl29!🏏#ISPL @ispl_t10… pic.twitter.com/fHekRfYx0i
— Suriya Sivakumar (@Suriya_offl) December 27, 2023