కె.హేమచంద్రారెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. కుల్లపరెడ్డి సురేశ్బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, మరో సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ కెమెరా స్విచాన్ చేశారు. కె.ఎల్.దామోదరప్రసాద్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా ఆర్థిక విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ‘ మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ నా జీవితకథను తెరకెక్కిస్తున్నాను. ఇందులో కథానుగుణంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. మంచి ప్యాడింగ్ ఉంటుంది. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాను’ అని దర్శక, నిర్మాత సురేశ్బాబు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: తోట తిరుపతిరెడ్డి, మాటలు: కరుణాకర్, కె.కె.రెడ్డి, సంగీతం: ఎం.ఎం.ఎస్.