డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ అచ్చ తెలుగందం శ్రీలీల మాత్రం యాక్టర్గా రాణిస్తూనే మరోవైపు మెడిసిన్ పూర్తి చేసే పనిలో ఉంది. ఈ భామ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది.
ఈ సందర్భంగా శ్రీలీల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలుంటాయి. కానీ ఇలాంటి భావోద్వేగభరితమైన, అభినయ ప్రధానమైన పాత్రలు చాలా అరుదుగా లభిస్తుంటాయి. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఈ సినిమాలో విజ్జి పాపగా నా పాత్ర ఎమోషనల్గా సాగుతుంది. ‘ఆడపిల్ల లేడీ పిల్లలా కాదు..పులి పిల్లలా ఉండాలి’ అని ఓ డైలాగ్ ఉంది. నా పాత్ర కూడా అదే రీతిలో ఉంటుంది. తండ్రీకూతుళ్ల బంధాన్ని సినిమాలో అందంగా ప్రజెంట్ చేశారు’ అని చెప్పింది.