Rhea Chakraborty | 2020లో బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput) అనుమానాస్పద మృతి తర్వాత నటి రియాచక్రవర్తి దారుణంగా ట్రోలింగ్కు గురైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయిన రియాచక్రవర్తి ఆ తర్వాత విడుదలైంది. రిలీజ్ తర్వాత చాలా కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తాజాగా ఆ విషయం గురించి India Today Conclave Mumbai 2023లో మాట్లాడింది రియా చక్రవర్తి (Rhea Chakraborty) .
ఓ కథకు రెండు పార్వ్శాలు ఉన్నాయని నేనెప్పుడూ నమ్ముతాను.. అందరూ దానిని నమ్మరు. ఆ రోజు..ఈ రోజు జీవితం రౌండప్ అయిపోయింది. 2020 తర్వాత నేను మొదటిసారి మీడియాతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను సిద్ధంగా ఉన్నానని అనుకున్నా.. ఇప్పుడు జీవితం ముందుకు సాగుతోంది.. నేను కోరుకుంటున్నది షేర్ చేయడానికి ఇండియా టుడే కాన్క్లేవ్ కంటే ఉత్తమమైనది ఏదీ లేదనుకుంటున్నానని చెప్పింది.
కొత్తగా ఆవిషృతమైన నేను చాలా డిఫరెంట్. నేనిప్పుడు భౌతికంగా 31 ఏళ్ల మహిళ శరీరంలో ఉన్న 80 ఏళ్ల మహిళ (మానసికంగా)గా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. తాను సుశాంత్ సింగ్ రాజ్పుత్ని చాలా మిస్ అవుతున్నానని. స్నేహితుడు, భాగస్వామి, సహచరుడు లేకుండా నా జీవితాన్ని ఊహించడం చాలా కష్టమని భావోద్వేగానికి లోనైంది రియా చక్రవర్తి.
మేము ఆర్మీలో ఉన్నప్పుడు మా నాన్న నాకు చెప్పారు.. మమ్మల్ని కాల్చి చంపేటప్పుడు సరెండర్ అవ్వొద్దన్నారు. ఆయన చెప్పినట్టుగానే నిలబడి.. ఎదురుపడి బుల్లెట్ తీసుకుంటామని చెప్పింది రియాచక్రవర్తి. భారతదేశంలోని పురుషులు తమ భార్యలు లేదా స్నేహితురాళ్ల మాట ఖచ్చితంగా వినరు. ఒకవేళ వారు వింటే మరింత మెరుగైన సమాజం ఉండేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చింది. ఈ కేసును ఎటూ తేల్చలేదు.. ఈ కేసులో ఎంతో మానసిక వేదనను అనుభవించిన రియాచక్రవర్తి మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చినట్టు చెప్పడంతో.. ఆమె ధైర్యానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.