Kangana Ranaut |ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే సెల్రబిటీల్లో టాప్లో ఉంటుంది బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ (Kangana Ranaut). ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా.. ఎప్పటికప్పుడు సమకాలీన అంశాల మీద తన వాయిస్ను వినిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది. తనపై విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా.. డోన్ట్ కేర్ అంటూ ముందుకెళ్తుంటుంది. ఈ భామ రాజకీయవేత్తలకు, జాతి వ్యతిరేకులు, తుక్డే తుక్డే గ్యాంగ్కు వ్యతిరేకంగా చేసిన కామెంట్ల వల్ల ప్రతీ ఏడాది రూ.30 కోట్లు-40 కోట్లు నష్టపోయాయని అంటోంది.
కంగనా ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్ హెడ్ ఎలోన్ మస్క్ ఇంటర్వ్యూను షేర్ చేసింది.. ఇంటర్వ్యూకు నేను కోరుకున్నది చెబుతా.. దాని పర్యవసానంగా డబ్బు కోల్పోతే, అలా ఉండండి.. అనే క్యాప్షన్ ఉంది. దీనినుద్దేశించి మస్క్ చెప్పినట్టుగా ఉండటం వల్లే తానెంత నష్టపోయానో చెప్పుకొచ్చింది కంగనా.
‘ఇది ఒక పాత్ర. నిజమైన స్వాతంత్ర్యం, విజయం, హిందూ మతం కోసం మాట్లాడటం, రాజకీయ నాయకులు, జాతీయ వ్యతిరేకులు, తుక్డే గ్యాంగ్ నేను 20-25 బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోల్పోయేలా చేశారు. వాళ్లు నన్ను రాత్రికి రాత్రే పక్కన పెట్టేయడం వల్ల సంవత్సరానికి రూ. 30-40 కోట్ల నష్టం జరిగింది. కానీ నేను స్వేచ్ఛగా ఉన్నా.
నేను కోరుకునేది ఖచ్చితమైన ఎజెండాతో నడిచే బహుళజాతి కంపెనీలు, భారతదేశ సంస్కృతి, సమగ్రత ద్వేషించే వారి కార్పొరేట్ బ్రాండ్ హెడ్లు కాదు. నాకు ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పకుండా నన్నేది ఆపకూడదు.. నేను ఎలోన్ మస్క్ను అభినందిస్తున్నా.. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ కేవలం బలహీనతలను మాత్రమే ప్రదర్శిస్తారు. కొద్ది ధనవంతుడు మాత్రం డబ్బును పట్టించుకోడు.. కానీ బాగా సంపన్నులు అయితే మాత్రం వాళ్లు నష్టపోతారని అనుకుంటున్నా..’ అని చెప్పుకొచ్చింది.