‘ఈ సినిమా ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హిజ్రాలకు సంబంధించిన ఓ పాయింట్ను తీసుకున్నాం. ట్రాన్స్జెండర్స్ అంశం కథలో సంఘర్షణకు కారణమవుతుంది’ అన్నారు రక్షిత్ అట్లూరి. ‘పలాస’ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా దర్శకుడు. త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో రక్షిత్ అట్లూరి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ పాత్రలో కనిపిస్తాను.
కథలో నరకాసురుడికి సంబంధించిన అంశాలేవి ఉండవు. రాక్షసుల్ని చంపాలంటే మనం అంతకంటే చెడ్డగా ఉండాలనే పోలికతో ఈ టైటిల్ పెట్టాం. కరోనా కారణంగా సినిమా పూర్తికావడానికి రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఛత్తీస్ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో చిత్రీకరణ జరిపాం. 20 రోజుల పాటు చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా నిలుస్తుంది. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాం. ‘పలాస’లో యాక్షన్ సీన్స్ బాగా చేశాననిపించింది. మంచి యాక్షన్, మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి’ అన్నారు.