Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్వైడ్గా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.
“वचनं धर्मस्य रक्षणं” 🙏
Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️
On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06
— Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024
నేడు శ్రీ రామ నవమి సందర్భంగా ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నాడు. ఇక ఈ పోస్టర్లో రాముడి చేతిలో హనుమంతుడు చేయి వేసినట్లు పోస్టర్ కనిపిస్తుంది. ఈ పోస్టర్పై ఈ పవిత్రమైన రామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముని ఆశీస్సులతో ఇదే నా ప్రమాణం.. జై హనుమాన్ తో ప్రపంచ ప్రేక్షకులకి ఒక మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తానని లైఫ్ టైం లో సెలెబ్రేట్ చేసుకునే సినిమాగా తీర్చిదిద్దుతానని అంటూ ప్రశాంత్ రాసుకోచ్చాడు. ఇక ఈ చిత్రం ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో రానుంది. ఇక ఈ పోస్టర్ చూసిన ఆడియన్స్ థ్రిల్గా ఫీలవుతున్నారు. ఈ సినిమాను 2025 విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.