అగ్ర కథానాయకుడు మహేష్బాబు పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన బర్త్డే బ్లాస్టర్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు ైస్టెలిష్గా కనిపిస్తున్నారు. సరికొత్త కేశాలంకరణ, చెవిపోగు, మెడపై రూపాయి టాటూ ధరించి ఇదివరకెప్పుడూ చూడని ట్రెండీలుక్లో దర్శనమిచ్చారు. ‘ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా..’ అనే వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ఈ బ్లాస్టర్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మహేష్బాబు రౌడీలను హెచ్చరించే సన్నివేశం.. ‘సార్ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి’ అంటూ కథానాయిక కీర్తి సురేష్ చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోలో మహేష్బాబు చాలా యంగ్గా కనిపించారని ఆయన అభిమానులు సోషల్మీడియాలో పొగడ్తలు కురిపిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులముందుకురానుంది.
త్రివిక్రమ్ సినిమాకు సమాయత్తం
‘సర్కారు వారి పాట’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్బాబు ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి. దీంతో తాజా హ్యాట్రిక్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని మహేష్బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డే నటించనుంది. ‘మహర్షి’ తర్వాత మహేష్బాబుతో పూజాహెగ్డే రెండోసారి జోడీ కడుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మది, సంగీతం: తమన్, ఎడిటర్: నవీన్నూలి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్, రచన-దర్శకత్వం: త్రివ్రిక్రమ్.