లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో కాకోరీ బ్లాక్ లోని రహమాన్ ఖేడాలో మామిడి మ్యూజియం రాబోతున్నది. కేంద్ర తోటల పెంపకం సంస్థ కార్యాలయం ఆవరణలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత మామిడి సీజన్ అయిరపోయే లోపల ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నారు. మామిడి రకాలు, వాటిలోని ఔష విలువలు, మామిడి ఉత్పత్తులు, చరిత్రతో పాటుగా మామిడి గురించి అంతగా తెలియని అనేక విషయాల సమాహారంగా ఈ మ్యూజియం రూపొందుతున్నది. భారత్ తో పాటుగా వివిధ దేశాలకు చెందిన 800 రకాల మామిడులను ఇందులో ప్రదర్శిస్తారు. కేవలం సీజన్ లోనే పండ్లను ప్రదర్శిస్తారు. సీజన్ తర్వాత లైవ్ ప్రదర్శన నిలిపవేస్తారు. మామిడి ఉత్రపతచ్తుల గురించిన సమగ్ర సమాచారం కూడా ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా సుమారు 80 దేశాలు మామిడిపై తపాళా బిళ్లలను విడుదల చేశాయి. ఆ బిళ్లల ప్రదర్శన కూడా విడిగా ఏర్పాటు చేస్తున్నారు. మామిడి బారతీయ వారసత్వ సంపదలో భాగం. పురాణాల్లో, ప్రాచీన గ్రంథాల్లో దాని ప్రస్తావనలు ఉన్నాయి. ఈ విషయమై కూడా ప్రత్యేక దృశ్య, శ్రవణ ప్రదర్శనలు మ్యూజియంలో ఉంటాయి. అలాగే మామిడిని ఆశించే చీడవీడలు, వాటిని నివారణ గురించిన విజ్ఞానం కూడా మ్యూజియంలో తెలుసుకోవచ్చు.