కేజీఎఫ్ సినిమాతో రికార్డులు సృష్టించి.. టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా నిలిచింది హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ (Hombale Films) . ఆ తర్వాత కేజీఎఫ్ 2, కాంతార సినిమాలతో మరోసారి సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. వచ్చే ఐదేండ్లకు సరిపడా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది హోంబలే ఫిలిమ్స్ బ్యానర్. ఇండియన్ ఎంటర్టైన్ మెంట్ ఇండస్ట్రీలో రూ.3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని హోంబలే ఫిలిమ్స్ చీఫ్ విజయ్ కిరగందూర్ తెలిపారు.
రానున్న రోజుల్లో వినోద పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్టు విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) చెప్పారు. వివిధ రకాల కథల సమాహారంతో సినిమాలు రాబోతున్నాయి. ఒక ఈవెంట్ మూవీ (భారీ బడ్జెట్ సినిమా)తోపాటు ప్రతీ ఏడాది ఐదారు సినిమాలు తెరకెక్కించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి తాము అన్ని దక్షిణాది భాషల్లో సినిమాలు రూపొందించాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. సంప్రదాయక కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాలుండబోతున్నాయని చెప్పారు.
గ్లోబల్ ఆడియెన్స్ మెచ్చేలా..
గ్లోబల్ ఆడియెన్స్ మెచ్చేలా సినిమాలు చేయాలనుకుంటున్నాం. ఇవి మన సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుతో ఉండాలనుకుంటున్నాం. యువత కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాం. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మా వంతుగా సహకారం అందించాలనుకుంటున్నామన్నారు విజయ్ కిరగందూర్. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన రైటర్స్, ఫిల్మ్ మేకర్స్ తో భాగస్వామ్యం అవుతున్నట్టు చెప్పారు.
హోంబలే ఫిలిమ్స్ పార్ట్నర్ చలువే గౌడ మాట్లాడుతూ.. తమ బ్యానర్లో సినిమాలు చేసేందుకు ఇద్దరు లీడింగ్ రైటర్లతో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. హిందీలో పలువురు రచయితలతో పనిచేస్తున్నాం. ఒకసారి కథ రెడీ అయిందంటే.. డైరెక్టర్లు, యాక్టర్లపై ఫోకస్ పెడతాం. మొదటగా సినిమాకు అతిముఖ్యమైన కథను సిద్దం చేసే రైటర్లపైనే ఫోకస్ పెడుతున్నామని చెప్పుకొచ్చారు.
Read Also : Trivikram Srinivas | తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది: త్రివిక్రమ్ శ్రీనివాస్
Read Also :Butterfly | అనుపమ పరమేశ్వరన్ బట్టర్ ఫ్లై నుంచి అమ్మ వీడియో సాంగ్