న్యూఢిల్లీ : కేజీఎఫ్ సిరీస్, కాంతార వంటి భారీ సినిమాలను నిర్మించిన హోంబలె ఫిల్మ్స్ రాబోయే ఐదేండ్లలో మరిన్ని భారీ సినిమాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఐదేండ్లలో వినోద రంగంలో రూ. 3000 కోట్లు వెచ్చిస్తామని హోంబలె ఫిల్మ్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
గత ఏడాది తమకు గొప్ప అనుభూతి ఇచ్చిందని హోంబలె ఫిల్మ్స్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రొడక్షన్ హౌస్ అధిననేత విజయ్ కిరంగదూర్ ట్వీట్ చేశారు. వినోద రంగంలో సుస్ధిర వృద్ధి కోసం రాబోయే ఐదేండ్లలో తాము రూ .3000 కోట్లు పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలు, చరితను , ఘన వారసత్వాన్ని నిరంతరం తమ భుజస్కంధాలపై మోస్తామని చెప్పుకొచ్చారు. ఇక కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి బ్లాక్బస్టర్లను అందించిన హోంబలె ఫిల్మ్స్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ నిర్ధేశకత్వంలో సలార్ను నిర్మిస్తోంది. ఈ మూవీతో పాటు పృధ్వీరాజ్ సుకుమారన్ టైసిన్, రక్షిత్ శెట్టి రిచర్డ్ ఆంథోని వంటి ఇతర ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.