ప్రముఖ కన్నడ సినీ నిర్మాణ సంస్థ మరికాసేపట్లో కొత్త సినిమాని ప్రకటించబోతోంది. ఏ హీరో, దర్శకుడితో సినిమా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉగాది పండగ రోజున సినీ అభిమానులకు ఊహించని గిఫ్ట్ నిఇస్తోంది హోంబళే. కొద్దినెలల క్రితమే ప్రభాస్ తో సలార్ సినిమాని ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు ప్రకటించబోయే కొత్త సినిమా తెలుగు హీరోతోనా లేదంటే కన్నడ హీరోతోనా అన్నది చర్చనీయాంశంగా మారింది.
కన్నడ అభిమానులంతా తమ స్టార్లతోనే ఉంటుందని సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్, యష్, రక్షిత్ శెట్టి, దర్శన్ వంటి హీరోల పేర్లతో హంగామా చేస్తున్నారు. మరోవైపు తెలుగు స్టార్ తో సినిమా ఉంటుందని టాలీవుడ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ లేదంటే అల్లు అర్జున్ లతో ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమాని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ల సినిమా సలార్ తర్వాత ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిది.