వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సినీనటి సాయిపల్లవి వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది. కశ్మీర్ఫైల్స్ సినిమాతోపాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ పోలీసులకు భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదు చేశారు.
దీంతో న్యాయ సలహా తీసుకుని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 21వ తేదీన నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించారు. కాగా, సాయిపల్లవి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆమె పిటిషన్ను కొట్టివేసింది.