విక్రమ్కుమార్-నాగచైతన్య కాంబోలో వచ్చిన చిత్రం మనం. అక్కినేని ఫ్యామిలీ హీరోస్ ను ఒకే ఫ్రేములో చూపించి బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టాడు విక్రమ్కుమార్. చైతూ-విక్రమ్ క్రేజీ కాంబినేషన్ థాంక్యూ సినిమాతో మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా..హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఫీమేల్ లీడ్ ఎవరనే దానిపై తాజాగా ఓ అప్డేట్ లైమ్ లైట్లోకి వచ్చింది.
రాశీఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రాశీఖన్నాకు తెలుగులో సినిమాలు లేవు. రాశీఖన్నా కూడా ఈ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, అధికారిక ప్రకటన రావడమే ఇక తరువాయి అని ఫిలింనగర్ సర్కిల్ టాక్. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ చిత్రంలో చైతూ యంగ్ లవర్ గా కనిపించబోతున్నాడట.