హైదరాబాద్: ప్రముఖ నటుడు హీరో కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాని, అందులో పాటిజివ్ వచ్చిందని చెప్పారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్ ద్వారా సూచించారు.
‘తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజివ్ వచ్చింది. గత రెండు రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నా. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని, ఏవైనా లక్షణాలు ఉన్నాయేమోనని నిశితంగా పరిశీలించండి’ అని శ్రీకాంత్ ట్విటర్లో పోస్టు చేశారు.
కాగా, తనకు కరోనా కరోనా పాజిటివ్ వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఉదయం ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని చెప్పారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అయితే చిరంజీవి కరోనా బారినపడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్ 9న కూడా మెగాస్టార్కు పాజిటివ్ వచ్చింది.