హీరో శర్వానంద్ 35వ సినిమా ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. రామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా గురువారం సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఇక నామాటే..’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచి, ఆలపించారు. యువతరం ప్రేక్షకులే లక్ష్యంగా తయారైన ఈ పాట చూడటానికి, వినడానికీ కూడా బావుంటుందని మేకర్స్ చెబుతున్నారు. లండన్లోని అద్భుతమైన లొకేషన్స్లో విష్ణుశర్మ, జ్ఞానశేఖర్ వీఎస్ లావిష్ చిత్రీకరణ, శర్వానంద్ ైస్టెలిష్ పెర్ఫార్మెన్స్ ఈ పాటలో కనువిందు చేస్తాయని వారు చెబుతున్నారు. శ్రాస్తి వర్మ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. శర్వా మునుపెన్నడూ లేనంత ైస్టెలిష్ అవతార్లో ఈ పాటలో కనిపిస్తున్నాడు. బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ, సహనిర్మాత: వివేక కూచిభొట్ల.