యువ హీరో నిఖిల్ 20వ చిత్రం ‘స్వయంభు’ శుక్రవారం హైదరాబాద్లోప్రారంభమైంది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్కొట్టారు. తొలి సన్నివేశానికి రామజోగయ్యశాస్త్రి దర్శకత్వం వహించారు. అనౌన్స్మెంట్ పోస్టర్స్లో నిఖిల్ను ఓ యోధుడిగా చూపించారు.
‘నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్నాం. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: వాసుదేవ్ మునెప్పగారి, బ్యానర్: పిక్సల్ స్టూడియోస్, రచన-దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.