తిరుమల : తిరుమలలో శ్రీవారిని ఈరోజు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ‘ హీరో ’ చిత్ర బృందం సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర హీరో అశోక్గల్లా, నటి నిధి అగర్వాల్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య , ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డితో ఎమ్మెల్యేలు వీరభద్రస్వామి, వాసుబాబు, ఎమ్మెల్సీలు రామారావు, రఘురాజు తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.