Mega Family | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ బాగానే సాగుతుంది. గతేడాది పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే మహేష్ బాబు పోకిరి, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలకు కూడా ఖతర్నాక్ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ప్రతి హీరో తమ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.
మొన్నటికి మొన్న ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా అలా మొదలైంది సినిమాను మళ్ళీ విడుదల చేశారు. అలాగే అదే రోజు రవితేజ మిరపకాయ కూడా మరోసారి థియేటర్లలోకి వచ్చింది. ఇక మార్చి మొత్తం మెగా హీరోలు దత్తత తీసుకుంటున్నారు. ఇప్పటికే మార్చ్ 4న జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ మరోసారి థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్.
Read More: Varun Tej | వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ఎక్కడి వరకు వచ్చింది ?
అదే రోజు చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా కూడా రీ రిలీజ్ అవుతుంది. 32 ఏళ్ల నాటి సినిమా కావడంతో 4K ప్రింట్ కోసం బాగానే ఖర్చు పెట్టారు దర్శక నిర్మాతలు. ఇక మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మగధీర సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు ఈ మధ్యే ప్రకటించింది గీతా ఆర్ట్స్. 2009లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సౌత్ ఇండియన్ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది.
Read More: Virupaksha | సాయిధరమ్ తేజ్ విరూపాక్ష టీజర్ లాంఛింగ్ టైం ఫిక్స్.. వీడియో
రామ్ చరణ్ మాస్ హీరోగా నిలబడడానికి కావాల్సిన పునాది వేసింది మగధీర. అలాంటి అద్భుతమైన సినిమాను మార్చి 27న మరోసారి విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.
ఇక ఆ మరుసటి రోజు అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ తరకెక్కించిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ దేశముదురు థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఒకవేళ మార్చి 28న దేశముదురు విడుదల కానీ పక్షంలో ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 24న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కూడా థియేటర్స్ లో దర్శనమివ్వడం ఖాయం. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులను చారిటీ కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్. ఇలా మొత్తానికి మార్చిలో ఏకంగా నాలుగు మెగా సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. మరి వీటికి రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.